30 ఏళ్ళ పైన దేశాన్నేలినందుకు
- పెళ్ళాం లేని జీవితం
- కూతురికి వైథవ్యం
- మనవరాళ్ళకి వైథవ్యం
- ఏకులమో చెప్పలేని కులం
- ఏమతమో చెప్పలేని మతం
- పోయిన ఇంటిపేరు(నెహ్రూ)
- రావణకాష్టంలా కాష్మీరు
- చైనాకి వదిలేసిన సరిహద్దు భూభాగం
- వ్యక్తిగత జీవితం పై మచ్చ
- ఎమర్జెన్సీ గోల
- బోఫోర్సు లీల
- విదేశీయులనే ఘనత
వీళ్ళు లేకపోతే మనదేశం అల్లకల్లోలమయ్యేదా? ఏమో! 1947తో పోలిస్తే చాలా చాలా బావుంది కదా. పాకిస్తాన్తో పోలిస్తే చాలా బావుంది కదా.

ఆహా!! ఏమి బాణం వదిలారు, ఎన్ని వ్యాఖ్యలు వస్తాయో చూడాలని ఉంది
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా యవన్ — ఆగష్టు 20, 2008 @ 4:22 అపరాహ్నం |
abbba adaragottaru,
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా phani — ఆగష్టు 20, 2008 @ 4:30 అపరాహ్నం |
మీరు సరిగ్గా ఏమి చెబుతున్నారో అర్దం కాలేదు…
వారి వంశం బాగా దేశాన్ని అభివృద్ది చేసింది అంటున్నారా?? లేకా తొక్కేసింది అంటున్నారా?
వాళ్ళు భ్రష్టు పట్టిపోయినా దేశాన్ని స్వాతంత్రం అప్పుడు వున్నా పరిస్థితి కంటే మెరుగయింది అంటున్నారా ??
సరే .. అవి పక్కనబెడితే …
మతం కులం తప్పని సరా ….??
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chandramouli — ఆగష్టు 20, 2008 @ 5:42 అపరాహ్నం |
దేశాన్ని పాలించేవారు ఎప్పుడూ తమ సార్వజనిక జీవితంకోసం వ్యక్తిగత జీవితాన్ని కోల్పోతారు. అందుకే వాళ్ళని బ్రతికుండగా నాయకులంటాం,చనిపోయిన తరువాత జాతీయనాయకులంటాం.ఇక తప్పులు ప్రతి మనిషీ చేస్తారు. ఆవే దేశనాయకులు చేస్తే, మొత్తం దేశానికి నష్టం జరుగుతుంది.అందుకే, ఆ తప్పులని “చారిత్రాత్మక తప్పు”లని మన ప్రజాస్వామ్యంలో వారి legacyని దర్జాగా ప్రశ్నించే అధికారం మనకుంది.నెహ్రూ వంశం పరిపాలనా దశలు మన దేశ ప్రజాస్వామ్యా పరిణితికి చిహ్నాలు.At the end of the day India is still a Democracy and a vibrant one. వారు నిజంగా నియంతలు కావాలనుకొనుంటే,ప్రజాస్వామ్యాన్ని కాలరాసే అవకాశాలు వారికి రాలేదంటారా? We can count their countless flaws, but still they deserve credit for wht they did and what they didn’t too…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఆగష్టు 20, 2008 @ 6:45 అపరాహ్నం |
mahesh gaaru…meeru cheppedi chusthe manam swathantramga vundataniki vaare kaaranam ani cheptunnattundi… ante vaallu niyanthalu kaadu kaabatti brathikipoyamani anukovala?
avunu,mana abhivruddi chusi aanandapadadam…ippatiki aa kutunbaniki vudigam chese vaalu chala mandi vunnaru…vudaharana kaavala? devudu palana chudandi…annitiki aa vamsam anumathi kavali…Prajaswamyam kada …bhesh…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా vijaya kranthi — ఆగష్టు 20, 2008 @ 7:12 అపరాహ్నం |
మహేశ్ గారు నెహ్రూవంశం మనదేశాన్ని నిజంగా ప్రజాస్వామ్యబద్దంగా పరిపాలించిందంటారా !!!!!!!!!!!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా chilamakuru vijayamohan — ఆగష్టు 20, 2008 @ 7:46 అపరాహ్నం |
నెహ్రూ కుటుంబాన్ననటం ఎందుకూ? అనేదేదో ఆ ఊడిగం చేసే కాంగిరేసోళ్లనే అనండి. రాజీవ్ గాంధీ అనంతరం రాక రాక ఆ కుటుంబాన్ని వదిలించుకునే అవకాశమొచ్చినా ఐదేళ్లు తిరిగేలోగా సోనియామ్మని తెచ్చి దేశమ్మీద రుద్దారు. ఇప్పుడేమో రాకుమారుడి కోసం పోటీలు పడి పూలబాటలు పరుస్తున్నారు. పిలిచి పదవులిస్తానంటే వద్దనేవాళ్లెవరు?
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా అబ్రకదబ్ర — ఆగష్టు 20, 2008 @ 8:05 అపరాహ్నం |
నెహ్రూ వంశాన్ని అనేదేముందండి. అంతకన్నా వెలగబెట్టినవాళ్ళు మాత్రం ఎవరున్నారు మనకి. ఆ ఒక్క కుటుంబాన్నే అనే పాపం ఎందుకు. అయినా మన జనం చిరంజీవి కోసం గంతులేస్తున్నారు గాని, జయప్రకాష్ నారయణ్ రాజకీయ రంగప్రవేశం చేస్తే ఆదరించారా? కనీసం పల్లెల్లో ఆయన పేరన్నా విన్నారా? జనం గొఱ్ఱెలయ్యి నాయకులని నిదించటమెందుకు.
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా Naga Muralidhar Namala — ఆగష్టు 20, 2008 @ 10:04 అపరాహ్నం |
@విజయమోహన్: నెహ్రూ కుటుంబం మన దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపలించకపోయినా (నిజానికి ఇప్పటివరకూ ఎవరూ పరిపాలించలేదు),రాజ్యాంగబద్ధంగానే పరిపాలించారు.వాళ్ళు చేసిన కొన్ని తప్పులకీ, సాహసాలకీ రాజ్యాంగబద్దంగా, వ్యక్తిగతంగా బలయ్యారు కూడా! అందుకే “they have made countless mistakes” అని నా మొదటి కామెంట్లో అన్నాను.
@విజయ క్రాంతి గారూ, వారి దయవలన మనం బ్రతికిపోయామని కాదు. అప్పట్లో (ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తరువాత మళ్ళీ powerలోకి వచ్చిన తరువాత)తలుచుకొనుంటే నియంతగా మారున్నా ఎవ్వరూ ఆపగలిగేవారు కాదు. మీరు కాస్త “contemporary Indian History” చదివి తరువాత నేను suggest చేసినదాని గురించి ఆలోచించండి. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ధృష్ట్యా నెహ్రూ కుటుంబాన్ని తిట్టిపోయడం సులభం. కానీ అప్పట్లో నెలకొనివున్న పరిస్థితుల నేపధ్యంలో చూస్తే,they played a crucial role in Indian polity and politics.
ఇక కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని నెహ్రూ కుటుంబం గాటకట్టి వారిని నిందిస్తే నిజంగా అర్థం ఉందంటారా? మనది ఒక ఫ్య్డూడల్ ప్రజాస్వామ్య విధానం అందులో వారూ ఒక భాగం. కాకపొటే చాలా ముఖ్యమైన భాగం అంతే తేడా!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కె.మహేష్ కుమార్ — ఆగష్టు 20, 2008 @ 10:19 అపరాహ్నం |
aentandi babu… adhragottestunnaru.. superga chepparu mastaru…
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా sujji — ఆగష్టు 21, 2008 @ 2:03 పూర్వాహ్నం |
తాను డేకలేక, తాడిపట్టి బాగోలేదు అన్నట్లు ఉంది ఈ విమర్శకుల సంగతి. మనకు అక్కడక్కడే మనుషుల్ని హతమార్చి, హింసారాజ్యం చెస్తె, వీళ్ళకు తెలిసి వచ్చేది, దేశాన్ని పరిపాలించడం ఎంత కష్టమో, విమర్శించదం ఎంథ సులభమో.
నెహ్రూ కుటుంబం ఎంథ బాగా రాజ్యమేలారు అన్నది కాదు యిక్కడ సమస్య. మన దేశం కన్న, ఎంత దారుణమైన దేశాలు ఉన్నాయి, ఈ భూగోళం లో, ఒకసారి అట్లాస్ చూసుకొండి బాబులూ!
వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా కొంపెల్ల శర్మ - తెలుగురథం. — ఆగష్టు 21, 2008 @ 3:38 అపరాహ్నం |